హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని హస్తినాపురం (బీఎన్రెడ్డి నగర్ నాగార్జునసాగర్ రోడ్డు)లో కొత్తగా ఏర్పాటుచేసిన మాంగళ్య షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ నటి రాశిఖన్నా ఆదివారం ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి ఇది 18వ స్టోర్ అని మాల్ చైర్మన్ కాసం నమఃశ్శివాయ తెలిపారు.
రాశిఖన్నాను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొన్నది. కార్యక్రమంలో మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం మల్లికార్జున్, కాసం నమఃశ్శివాయ, కాసం కేదారి, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్, కాసం ప్రణీత్, తోనుపూనూరి కార్తిక్ అరుణ్, పుల్లూరు వరుణ్ విశాల్ పాల్గొన్నారు.