హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు క్యూఆర్ కోడ్తో ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని వారిని గుర్తించి, వారితో నూతన బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
శుక్రవారం బీఆర్కేభవన్లో స్వయం సహాయక సంఘాల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల గ్రూపులు, సభ్యుల వివరాలను అప్డేట్ చేయాలని చెప్పారు. బ్యాంకులిస్తున్న వడ్డీ లేని రుణాలను ఉత్పాదక రంగాల్లో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 6,06,000 స్వయం సహాయక బృందాల్లో 64 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ హనుమంతరావు, పురపాలకశాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సెర్ప్ డైరెక్టర్ వై నర్సింహారెడ్డి, శ్రీనిధి ఎండీ విద్యాసాగర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.