న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోయినా ఆధార్ పాలీవినైల్ క్లోరైడ్(పీవీసీ) కార్డులకు ఆర్డర్ చేయవచ్చని యూఐడీఏఐ తాజాగా ప్రకటించింది. ఏ మొబైల్ నంబర్తో అయినా పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చని పేర్కొన్నది. అంతే కాకుండా ఒకే ఫోన్ నంబర్తో కుటుంబం మొత్తానికి పీవీసీ కార్డుల కోసం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది.
పీవీసీ కార్డు కోసం దరఖాస్తు ఇలా
1. ఆధార్ అధికారిక వెబ్సైట్ www.uidai. gov.in లేదా www.resident. uidai.gov.in ఓపెన్ చేయాలి.
2. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
3. మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. టైమ్ బేస్డ్ వన్ టైమ్ పాస్వర్డ్(టీవోటీపీ)పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సెక్యూరిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ను పూర్తి చేయాలి.
4. ఆధార్ వివరాలను సరిచూసుకొని ధ్రువీకరించుకోవాలి. తర్వాత ప్రింటింగ్కు ఆర్డర్ ఇవ్వాలి. ఒక్కో కార్డు ప్రింటింగ్కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.