హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఏండ్లుగా పాతుకుపోయిన వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. తాజా బదిలీల్లో స్థాన చలనం కల్పించింది. సర్కార్ శనివారం వేర్వేరు జీవోలు విడుదల చేసింది. సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అదనపు డైరెక్టర్గా పీవీ శ్రీహరికి పోస్టింగ్ ఇచ్చింది. ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను, సమగ్రశిక్షా ప్రాజెక్ట్ ఏడీగా బదిలీ చేసింది. ఇదే పోస్టులో ఉన్న రాధారెడ్డిని బదిలీ చేసి, ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాసంస్థ డైరెక్టర్గా నియమించింది. మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ డైరెక్టర్గా సీహెచ్ రమణకుమార్, తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ డైరెక్టర్గా జీ ఉషారాణిని నియమించింది. మరో అడిషనల్ డైరెక్టర్ (కో ఆర్డినేషన్) కే లింగయ్యను ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్గా నియమించడమే కాకుండా ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్సెస్సీ బోర్డు) డైరెక్టర్గా అదనపు బాధ్యతలప్పగించింది.
పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ ఆర్జేడీగా ఎం సోమిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. వరంగల్ ఆర్జేడీగా ఈ విజయలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. జేడీ (సర్వీసెస్) బీ వెంకటనర్సమ్మ, ఓపెన్ స్కూల్ జేడీగా పీ రాజీవ్, మాడల్ స్కూల్ జేడీగా కే సత్యనారాయణరెడ్డికి పోస్టిం గ్ ఇచ్చారు. సత్యనారాయణరెడ్డికి అడిషనల్ డైరెక్టర్ (కో ఆర్డినేషన్)గా అదనపు బాధ్యతలప్పగించారు. సమగ్రశిక్ష జేడీ-1గా పీ మదన్ మోహన్, సమగ్రశిక్షా జేడీ-2గా ఏ ఉషారాణికి పోస్టింగ్ ఇచ్చారు.
నలుగురు డీఈవోలను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ డీఈవో రోహిణిని సంగారెడ్డి డీఈవోగా బదిలీచేశారు. అక్క డ డీఈవోగా ఉన్న వెంకటేశ్వర్లును రంగారెడ్డి, మంచిర్యాల డీఈవో యాదయ్యను హైదరాబాద్ డీఈవోగా బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు. టెట్ సెల్లో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న రేవతిరెడ్డికి మాడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. పలువురు డిప్యూటీ ఈవోలను బదిలీ చేసి, డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగించారు. రేణుక(మేడ్చల్ – మల్కాజిగిరి), విజయకుమారి(మహబూబ్నగర్), సుశీందర్రావు(నల్లగొండ), వాసంతి( భద్రాద్రి కొత్తగూడెం), భిక్షపతి(ములుగు, యాదాద్రి డీఈవో-ఎఫ్ఏసీ) అప్పగించారు. మరికొందరు అసిస్టెంట్ డైరెక్టర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగించారు. శాస్త్రి(సిద్దిపేట), ప్రవీణ్(మెదక్), అబ్దుల్ ఘనీ(వికారాబాద్), వెంకటేశ్వర్రెడ్డి(వనపర్తి), మల్లికార్జున్ (కామారెడ్డి)కు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగించారు.