హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : నాడు ప్రధానిగా పీవీ నరసింహారావు, దేశ ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్సింగ్ కృష్ణార్జునుల్లాగా దేశాన్ని పాలించారని, కానీ నేడు మోదీ, అమిత్షా కలిసి దుర్యోధన, దుశ్శాసనుల పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ విమర్శించారు. ఆదివారం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ చిత్రపటానికి నారాయణ నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.