కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంస
పరిశుభ్రతతోనే ఆరోగ్యం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంసించారు. బుధవారం ఆయన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ ), యునిసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వాటర్ శానిటేషన్, హైజిన్ కాంక్లేవ్- 2022లో వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణతో పాటు మరో 5 రాష్ర్టాలు మాత్రమే ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్నాయని చెప్పారు.
పరిశుభ్రతతోనే ఆరోగ్యం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సబ్బుతో చేతులు కడుక్కోవడం లాంటి పరిశుభ్ర పద్ధతులను ఆచరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఎన్ఐఆర్డీ, యునిసెఫ్ సదస్సులో ఆయన వర్చువల్గా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి నొక్కి చెప్పిందని అన్నారు. రోగాలు, జబ్బులు రాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డీజీ నరేంద్రకుమార్, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి గిల్లియన్ మిల్లిసొప్ పాల్గొన్నారు.