గజ్వేల్, మే 2: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన పురాణం సాహిత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటర్ రహదారి లడక్లోని ఉమ్లింగ్ లా పాస్ శిఖరాన్ని (5,798 మీటర్లు) అధిరోహించి తెలంగాణ రాష్ర్టానికి పేరు తెచ్చాడు. ఏప్రిల్ 12న గజ్వేల్ నుంచి 100 సీసీ హీరో ప్యాషన్ బైక్పై తన ప్రయాణాన్ని ప్రారంభించిన అతను, అదే నెల 28న ఉమ్లింగ్ లా శిఖరానికి చేరుకుని, 100 సీసీ బైక్పై చేరుకున్న మొదటి యువకుడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. తక్కువ ఆక్సిజన్, తీవ్రమైన చలి, ప్రమాదకరమైన మూల మలుపులు, చెదిరిపోయిన రహదారి, నిశ్శబ్ద పరిస్థితులను ఎదుర్కొని అతని ప్రయాణం 17 రోజులపాటు సాగింది. సాహిత్ తన లక్ష్యాన్ని చేరుకోవడంపై తల్లిదండ్రులు శోభారాణి- శ్రీనివాస్, స్నేహితులు, బంధువులు, పట్టణవాసులు అభినందించారు.