హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలా మూడో శనివారం తప్పనిసరిగా పేరెంట్స్ టీచర్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సమావేశం నిర్వహణకు మార్గదర్శకాలు, ఎజెండాకు సంబంధించిన అంశాలపై సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెలా పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) సమావేశాలతో పాటు వీటిని సైతం తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు.
పీటీఎం మార్గదర్శకాలు