పెద్దపల్లి రూరల్, మే 8: ప్రేమించి పెండ్లి చేసుకొన్న భార్య కాపురానికి రావట్లేదని ఓ యువకుడు సొంత కారుకే నిప్పంటించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అందుగుల శివారు లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బసంత్నగర్కు చెందిన అర్జున్ సామిల్పాల్ ఏడాది క్రితం హైదరాబాద్కు చెంది న అనూషను ప్రేమవివా హం చేసుకొన్నాడు. కొంతకాలం వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తగా అనూష పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి వస్తదో రాదోననే మనోవేదనతో కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అందుగులపల్లి శివారు పెద్దమ్మ ఆలయ సమీపంలో రోడ్డు పక్కన తన స్కార్పియోకు నిప్పు పెట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.