హాజీపూర్, ఫిబ్రవరి 16 : సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.