హైదరాబాద్: శాసన మండలిలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శాసనమండలిలో ఘనంగా జరిగాయి. మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ పాషా ఖాద్రీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
హైకోర్టులో గణతంత్ర దినోత్స వేడుకలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ పతాకావిష్కరణ చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్.. బీఆర్కే భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఉపకార్యదర్శులు, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.