వేములవాడ టౌన్ /యాదాద్రి, మే 11: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను బుధవారం నుంచి మూసివేయనున్నారు. ఈ మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంతోపాటు ప్రముఖ ఆలయాల్లో ఈ నెల 12 నుంచి 22 వరకు భక్తులకు దర్శనాలను రద్దుచేశారు. కాగా, స్వామివార్లకు నిత్య కైంకర్యాలు యథావిధిగా ఆలయంలో అంతరంగికంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. వేములవాడ రాజన్న కల్యాణకట్టలో తలనీలాల మొక్కును రద్దు చేసినట్టు తెలిపారు. పెద్దసంఖ్యలో ఆలయ పూజారులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో అర్చక సమాఖ్య విజ్ఞప్తిమేరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.