హైదరాబాద్, జనవరి 24: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ప్రవీణ్రావుకు మరో గౌరవం దక్కింది. ఇండియన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అసోసియేషన్ (ఐఏయూఏ) సెక్రటరీ జనరల్గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు సోమవారం ప్రకటించారు. ఈ పదవి దక్కడంపై వీసీ ప్రవీణ్రావు హర్షం వ్యక్తం చేశారు.