హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఈసెట్ కన్వీనర్గా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఓయూలో ఎలక్ట్రానిక్స్ విభాగం ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు. ఇది వరకు ఈసెట్ కన్వీనర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో ఓయూ వీసీ ప్రతిపాదనల మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు చంద్రశేఖర్ను నూతన కన్వీనర్గా నియమించారు.