హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధికి ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. టికెట్ ఆశించడం తప్పు కాదన్నారు. ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పిలుపునిచ్చారు. తాను కేసీఆర్ తయారు చేసిన సైనికుడినని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పార్టీ బలోపేతం కోసమేనని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మద్దతు
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థికి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సం ఘం మద్దతు తెలిపింది. శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన సంఘం అధ్యక్షుడు గంధం రాములు మద్దతు పత్రాన్ని అందజేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. మునుగోడును అన్ని విధాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పా రు. దండుమల్కాపుర్లో పారిశ్రామిక పార్కు ను ఏర్పాటు చేశామన్నారు. మంత్రిని కలిసినవారిలో సంఘం ప్రధాన కార్యదర్శి కరుణాకర్రెడ్డి, సలహాదారులు కోలా శ్రీనివాస్, సంఘం కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మర్రపు గంగాధర్రావు, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, సోషల్ మీడియా ఇంచార్జి మోహన్నాయక్ పాల్గొన్నారు.