మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేటుచేసుకుంది. పెరోల్(Parole)పై బయటికి వచ్చిన ఖైదీ(Prisoner) మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ఉబ్బని వీరన్న అనే జీవిత ఖైదీ చర్లపల్లి జైలు నుంచి పెరోల్పై ఈ నెల18న గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు 2007లో తల్లి ముత్తమ్మ, అన్న రాములును హత్య చేశాడు. వీరన్నది సహజ మరణమా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.