హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనదని, నరేంద్రమోదీ ఆ విషయం మర్చిపోయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్టే మాట్లాడారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డు పడుతున్నా, కేసీఆర్ నాయత్వంలో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్గా ఉన్నదని తెలిపారు.
తెలంగాణలాగా తమ రాష్ట్రాలు అభివృద్ధి కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు బలంగా కాంక్షిస్తున్నారని చెప్పారు. బీజేపీ అరాచకాలకు విసిగిపోయిన దేశ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తుండటం మోదీకి మింగుడు పడటంలేదని, భయం మొదలయ్యే అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సైన్స్ను, దేవుణ్ణి కూడా నమ్ముతారని, అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి ఆలయమే నిదర్శనమని ఉదహరించారు.