విద్యానగర్, మార్చి 8: దేశ ప్రజల సంక్షేమం కోసం ఔషధాల ధరలు తగ్గించాలని, అన్ని మెడిసిన్లు, వైద్యపరికరాలపై జీరో శాతం జీఎస్టీ విధించాలని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్ కోరారు. శుక్రవారం ఆయన కరీంనగర్లోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలని, ప్రభుత్వరంగ ఫార్మా, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలని కోరారు. ఫార్మారంగంలో అనైతిక కార్యక్రమాలను అరికట్టడానికి కోడ్ను అమలు చేయాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. యూనియన్ 5వ మహాసభలు శని, ఆదివారాల్లో కరీంనగర్లోని పద్మశాలీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.