బోధన్, మే 27: ప్రతిష్ఠాత్మక నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డుకు బాన్సువాడలోని మా తాశిశు సంరక్షణ దవాఖాన హెడ్నర్సు పీ ఆరోగ్యజ్యోతి ఎంపికయ్యారు. అత్యుత్తమ సేవలు అం దించిన నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కర్ణాటక న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఏటా ఈ అవార్డు ను అందిస్తున్నాయి. నర్సుగానే కాకుండా స్వచ్ఛందంగా ఆరోగ్యసేవలను అందిస్తున్న ఆరోగ్యజ్యోతిని ఈ ఏడాదికి ఎంపిక చేశారు. వచ్చే నెల 6న బెంగళూర్లో ఈ అవార్డును ఆరోగ్యజ్యోతి అందుకోనున్నారు.