హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఈ నెల 13న శంషాబాద్ మండలం ముచ్చింతల్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వస్తున్న నేపథ్యంలో సీఎస్ సోమేశ్కుమార్ గురువారం బీఆర్కేభవన్లో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ముచ్చింతల్ మార్గంలో రాకపోకలు సాగించేలా బారికేడింగ్తో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని రోడ్లు భవనాలశాఖ అధికారులకు సూచించారు. ప్రొటోకాల్ ప్రకా రం 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ఆశాఖ అధికారులకు సూచించారు.