హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగా ణ): బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భారత్ ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విమర్శించారు. బీజేపీ ప్ర భుత్వం కార్మికులు, ఉద్యోగులకు తీవ్ర అన్యా యం చేస్తున్నదని ఆరోపించారు. కార్మికులు మేడే వేడుకలను బీజేపీ వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు కార్యాచరణగా మలచుకోవాలని సూచించారు. ఇందు కోసం మే 1 రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సమావేశంలో బీఆర్టీయూ నాయకులు ఎల్ రూప్సింగ్, పీ నారాయణ పాల్గొన్నారు.