హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. పోలింగ్, కౌం టింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, వారికి శిక్షణ తరగతులను నిర్వహించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో తప్పిదాలకు ఆసారం లేకుండా పకడ్బందీగా పరిశీలన చేయాలని, ఓటరు జాబితాలో మార్పులు-చేర్పులు, పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిషరించాలని ఆదేశించారు.