హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): వేతన సవరణ విషయంలో విద్యుత్తు ఉద్యోగులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, పీఆర్సీ అమలు ఖాయమని టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ స్పష్టం చేశారు. పీఆర్సీపై కొన్ని పత్రికలు చేస్తున్న అసత్య ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఎస్ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్లోని నివాసంలో జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావును కలిశారు. ఈ భేటీ అనంతరం జాన్సన్ మాట్లాడుతూ.. పీఆర్సీని అమలు చేయడంతోపాటు విద్యుత్తు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎండీ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. సీఎండీని కలిసినవారిలో టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్, రాష్ట్ర సీనియర్ వరింగ్ ప్రెసిడెంట్, జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.