Gaddam Prasad Kumar | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనసభ స్పీకర్ ఎన్నిక ఈనెల 14న జరగనుంది. ఈ మేరకు 13న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న శాసనసభ ప్రారంభంకాగానే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన విషయాన్ని ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు.
15న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. స్పీకర్ అభ్యర్థిగా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ను కాంగ్రెస్ ఎంపికచేసినట్టు సమాచారం.