ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కౌటాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లలో భక్తుల సందడి నెలకొన్నది. ఏడోరోజైన మంగళవారం లక్ష మంది పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలకు పూజలు నిర్వహించారు. పెద్దలకు పితృతర్పణాలు చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహితకు నక్షత్ర హారతి ఇచ్చారు. – కాళేశ్వరం/కోటపల్లి/వేమనపల్లి/కౌటాల