నీలగిరి, అక్టోబర్ 25: ప్రజల మనసుల్లో టీఆర్ఎస్కు బలమైన స్థానం ఉన్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అందు కే సీఎం కేసీఆర్ను ప్రజలందరూ గౌరవంగా చూస్తున్నారని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయా న్ని కాంక్షిస్తూ మునుగోడు మండలం కొరటికల్ లో మంగళవారం ఆయన ప్రచారం చేశారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం భద్రాచలానికి చెందిన ఉద్యమకారుడు తూతిక ప్రకాశ్.. భద్రాచలం నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. ఇటీవలే మునుగోడుకు చేరుకుని అన్ని మండలాల్లో పర్యటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. తన సైకిల్ యాత్ర 750 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా అక్కడే ప్రచారంలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ను ప్రకాశ్ కలిశారు.