మహబూబాబాద్ రూరల్, జూలై 4: లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏఈ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన మంగళవారం మహబూబాబాద్లో చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కాన్వాయిగూడెం పంచాయతీ వైకుంఠధామం నిర్మాణ పనులను కాంట్రాక్టర్ అశోక్రెడ్డి పనులు పూర్తిచేశారు. రూ.3.19 లక్షల బిల్లు రావాల్సి ఉన్నది. మి గతా బిల్లు కావాలంటే ఏఈ లలిత రూ.6 వేలు లంచం డిమాండ్ చేయగా చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. 3 వేలు గత నెలలో చెల్లించగా, మిగతా రూ.2 వేలను మంగళవారం ఏఈ లలితకు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు.