హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతున్నదని, ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ సెల్ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియా ఫోన్ ట్యాపింగ్ కేసు గూర్చి వివరాలు అడిగింది. అయితే సీపీ స్పందిస్తూ.. ఉహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. ప్రభాకర్రావును పట్టుకోవడం లేదనే వార్త అవాస్తవమని స్పష్టంచేశారు. ప్రభాకర్రావు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని సీపీ పేర్కొన్నారు.