హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఆర్టిజన్ల వేతన సవరణ, ఇతర అలెవెన్స్లపై బుధవారం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కార్మికశాఖ అధికారుల సమక్షంలో విద్యుత్తు సంస్థల యాజమాన్యాలతో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం కార్మికశాఖ జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్రెడ్డి సమక్షంలో ఇండస్ట్రియల్ డిస్పూట్ యాక్ట్ సెక్షన్ 12 (3) ప్రకారం ఒప్పందం చేసుకున్నారు.
యాజమాన్యం తరఫున ట్రాన్స్కో జేఎండీ సీ శ్రీనివాస్రావు, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ ఎస్ అశోక్కుమార్, అధికారులు పర్వతం, వెంకటేశ్వర్రావు, జీ శ్రీనివాస్ పాల్గొన్నారు. వీ వెంకటేశ్వర్లు, జీ సాయిబాబు (టీఈఈ-1104), ఈ శ్రీధర్, ఎస్ ప్రభాకర్ (టీఎస్ఈఈ – 327), జాన్సన్, కోడూరి ప్రకాశ్ (టీఆర్వీకేఎస్-హెచ్ 58), ఎంఏ వజీర్, డీ రాధాకృష్ణ (టీఎస్పీఈ-1535) పాల్గొన్నారు.