హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా విద్యుత్తు నష్టాలను తగ్గించేందుకు ఇంజినీర్లు కృషి చేయాలని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన డైరీ, క్యాలెండర్ను మంగళవారం విద్యుత్తుసౌధలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. విద్యుత్తు రంగ ఇంజినీర్ల న్యాయమైన డిమాండ్లు.. పీఆర్సీ-2022, హెచ్ఆర్ఏ పెంపు, ప్రమోషన్లు, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు మార్పు తదితర సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు, టీఈఈఏ అధ్యక్షుడు ఎన్ శివాజీ మాట్లాడారు.