హైదరాబాద్ : విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో నాందేడ్లో చేసిన వ్యాఖ్యలను అలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్), తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసొసియేషన్లు (TSPEA)లు స్వాగతించాయి. ఈ మేరకు ఆదివారం నాందేడ్ వెళ్లిన సంఘాల నేతలు సీఎం కేసీఆర్ను కలిసి ప్రైవేటీకరణ, బొగ్గు దిగుమతి తదితర అంశాలపై జాతీయ స్థాయిలో మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారిగా విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానించారని, తాజాగా అదే వైఖరిని కొనసాగించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలను మహారాష్ట్రలోని ఇంజినీర్లు, దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు హర్షిస్తున్నారని ఏఐపీఈఎఫ్ సెక్రెటరీ జనరల్ పీ రత్నాకర్ రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్నందిస్తున్నారని, ఇది కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. పలు సంఘాల నేతలు సదానందం, వెంకటనారాయణరెడ్డి, జనప్రియ, పీవీ రావు, గోపాల్రావు, గోపాలకృష్ణ, బాగయ్య తదితరులు నాందేడ్లో సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు.