హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని హైటెక్స్లో బుధవారం నుంచి మూడు రోజులపాటు 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో నిర్వహించనున్న ట్టు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ చక్రధర్రావు చెప్పారు. ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 370 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. 30 వేల మంది బిజినెస్ విజిటర్స్ ఎక్స్ పోను సందర్శించే అవకాశం ఉన్నదని తెలిపారు.
మంగళవారం జరిగే నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్లో భారత్, ఆఫ్రికా, యూ రప్, అమెరికా, సార్ దేశాల నుంచి 1200 మంది ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. 2019లో దేశంలో బ్రాయిలర్ ఉత్పత్తి 7 శాతం పెరిగి దాదాపు 6 మిలియన్ టన్నులకు చేరిందన్నారు. ప్రాసెస్డ్ చికెన్ డిమాండ్ 10 నుం చి 21 శాతం మధ్య పెరిగిందని చెప్పారు.
భారత్ గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో, చికెన్ ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాతి స్థానాన్ని ఆక్రమించిందని తెలిపా రు. ఎక్స్పో వివరాల కోసం 9490612032, 98490 12030 ఫోన్నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ లేయర్స్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్రెడ్డి, బ్రాయిలర్ బ్రీడర్స్ అసోసియేషన్ కార్యదర్శి హర్షవర్ధన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు.