హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నలుగురు ఐ ఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ కా ర్యదర్శిగా పనిచేస్తున్న 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డీ రొనాల్డ్రోస్ను బదిలీ చేసి, జీహెచ్ఎంసీ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేస్తున్న 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారి లోకేశ్కుమార్ డీఎస్ను బదిలీ చేసి ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయంలో రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి (అడిషనల్ సీఈవో)గా నియమించింది. ఎక్సైజ్శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయంలో జాయింట్ సీఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. అంతకు ముం దు జాయింట్ సీఈవోగా ఉన్న రవికిరణ్ను గతంలోనే రిలీవ్ చేశారు. పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫారూఖీని ఎక్సైజ్శాఖ కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ సీఎస్శాంతికుమారి జీవో-953ని జారీ చేశారు.