హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ డివిజన్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని సీనియర్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న కే సుధీర్బాబు, అతని అనుచరులు వద్ది నర్సిరెడ్డి, టీ నితిన్, ఎం సుదర్శన్లకు చెందిన రూ.6.57 లక్షల ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోట్ల రద్దు సమయంలో రూ.3.75 కోట్లను కొత్త నోట్లుగా నిబంధనలకు విరుద్ధంగా మార్చారని పేర్కొన్నారు.