హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కోర్సు పూర్తి చేశాక స్థిరపడొచ్చన్న భరోసా దొరికేలా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల కరికులాన్ని సాంకేతిక విద్యామండలి అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీ-24 పేరుతో ‘అవుట్ కమ్ బేస్డ్ కరికులమే లక్ష్యంగా విద్యార్థులకు పరిశ్రమల్లో ఆరు మాసాల శిక్షణను తప్పనిసరిగా అమలుచేస్తారు. యాడ్ ఆన్ కోర్సును, మైనర్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మేజర్ కోర్సుల్లోని ఈసీ విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ను మేజర్గా, సీఎస్ఈ కోర్సులోని ఏఐని మైనర్ ప్రోగ్రాంగా తీసుకోవచ్చు. విద్యార్థులు ఎన్పీటీఎల్, స్వయం పోర్టర్లలోని కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. తాము సంపాధించిన క్రెడిట్లను బదిలీ చేసుకోవచ్చు. ఈవీ పరిశ్రమకు డిమాండ్ పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ బ్యాటరీలు సబ్జెక్టులను మైనర్గా చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత మనదేశంలోని ఇతర రాష్ర్టాల కరికులాన్ని అధ్యయనం చేశారు. ప్రస్తుతం పపంచంలోని ప్రముఖ దేశాల్లోని కరికులాన్ని అధ్యయనం చేస్తున్నారు.