హైదరాబాద్ : ‘గంజాయిని నిర్మూలిద్దాం.. యవతను కాపాడుకుందాం’ అనే నినాదంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ అదనపు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు ఓ పాటను రాశారు. ఎల్బీనగర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ క్యాంప్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పాటను గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, ఎస్ఓటీ డీసీపీ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంజాయికి బానిసై జీవితాలను చిత్తు చేసుకుంటున్న వారిని చైతన్యవంతులను చేసేలా పాటలను రాసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను సీపీ అభినందించారు.