హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ‘ఓ ధీరుడిగా నే పోరే చేసే సమయం నాకిపుడొచ్చినది.. నా గుండెల్లో ధైర్యమే నన్ను తలపడమంటూ పంపినది..’ అంటూ పోలీస్ విధులను వివరిస్తున్న పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిం ది. ఏఆర్ హెడ్క్వార్టర్స్ పేట్లబుర్జ్లో 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ వంశీకృష్ణ అన్నం ఈ పాటను స్నేహితుడు అనిల్ సాయంతో రాసి పాడారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్లు ఈ పాటను సోషల్మీడియాలో అప్లోడ్చేశారు. నాలుగు రోజుల్లోనే యూట్యూబ్లో 27 వేల మంది, ఫేస్బుక్లో 35 వేల మంది ఈ పాటను వీక్షించారు. వంశీకృష్ణను ఉమెన్సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి అభినందించారు.