Telangana
- Dec 27, 2020 , 01:33:18
రెండుకిలోల బంగారం పట్టివేత

శంషాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికురాలి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను తనిఖీచేశారు. ఆమె సామగ్రిని సోదాచేయగా.. ఐదు బంగారు బిస్కెట్లు, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు లభించాయి. ఆమె నుంచి మొత్తం 2.021 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్లో దాని విలువ రూ.96.04 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
తాజావార్తలు
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- కరోనా టీకాలు స్వీకరించిన భూటాన్ ప్రధాని
- క్రికెట్ ఫ్యాన్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్!
- కమలా హ్యారిస్ సొంతూరులో వేడుకలు
- చిరు 'లూసిఫర్' రీమేక్ మొదలైంది..వీడియో
- బెంగాల్లో సీఎం మమతకు మరో షాక్
- ప్రభుత్వ ఉద్యోగులకు మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్
- పేదలకు కొండంత అండ కల్యాణ లక్ష్మి
- శశికళకు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు
- అతని మృతికి వ్యాక్సిన్తో సంబంధం లేదు : ఆరోగ్య శాఖ
MOST READ
TRENDING