హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామకాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆదివారం జరిగే కానిస్టేబుల్, తత్సమాన ఉద్యోగాలకు టీఎస్ఎల్పీఆర్బీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5.30 గంటలకు పరీక్షలు ముగుస్తాయి. ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లో బోర్డు సూచనల మేరకు స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు నమోదుపై ఇన్విజిలేటర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. హాల్టికెట్పై తప్పనిసరిగా అభ్యర్థి ఫొటో అతికించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్కు సహకరించాలని కోరింది.
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించే కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు, స్కాడ్ బృందాలకు సైతం బోర్డు సెల్ఫోన్ల అనుమతి నిరాకరించింది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని తెలిపింది. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయని బోర్డు హెచ్చరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాం తాల్లో పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.