హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. లక్డీకాపూల్లోని తన కార్యాలయంలో బుధవారం ఆయన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్త, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, రాచకొండ సీపీ, మహేష్ భగవత్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్తో మాట్లాడారు. పోలీస్శాఖ గతేడాది మొదటి వేవ్ సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్వేవ్లో కూడా పటిష్ఠంగా విధులు నిర్వహిస్తున్నదని హోం మంత్రి పేరొనారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో పోలీస్శాఖ ముందు ఉంటుందని, ఎప్పటిలాగే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు. వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని పనిచేస్తున్నదని తెలిపారు.
చాలామంది ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజెక్షన్లను ఇండ్లల్లో నిల్వ చేసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల, సిలిండర్ల తాతాలిక కొరత ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి మహమూద్ అలీ అన్నారు. సిలిండర్లు రీఫిల్లింగ్ చేసేందుకు కొరత ఏర్పడవచ్చని, అవసరమైన వారికి దొరకని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు అవసరం లేకపోయినా ఆక్సిజన్ నిలువ చేసుకోవద్దని, ప్రభుత్వం ఆక్సిజన్తోపాటు ప్రాణాలు నిలిపి ఔషధాలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుందని తెలిపారు. ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ను బ్లాకు మారెటింగ్ చేసేవారిపై పోలీస్శాఖ ఉకు పాదం మోపుతుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రజా సమావేశాలపై నిషేధం ఉన్నదని, హైకోర్టు కూడా ఈ విషయంలో ఆదేశాలిచ్చిందని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని హోం మంత్రి కోరారు. రంజాన్ మాసం కారణంగా, ముస్లింలు న మాజ్, తరావీలు చేసే సమయంలో కచ్చితంగా భౌతికదూరం పాటించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సామాజిక మాధ్యమాల్లో వధంతులు, ఇతర అసత్య ప్రచారాలకు పాల్పడితే, కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు. ఈ పరిస్థితులలో ప్రజలకు సేవ చేయడంలో పోలీస్శాఖ ముందుండాలని ఉన్నతాధికారులను కోరారు.