TSLPRB | హైదరాబాద్ : ఈ నెల 30న పోలీసు కానిస్టేబుల్ (సివిల్, టెక్నికల్) ఉద్యోగాలకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ తుది రాతపరీక్షలకు సంబంధించి టీఎస్ఎల్పీఆర్బీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సివిల్ పోస్టులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. అయితే తుది రాతపరీక్షలు రాసే అభ్యర్థులు గంట ముందే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
సివిల్, టెక్నికల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు రెండింటికీ అర్హత సాధించిన అభ్యర్థులకు హైదరాబాద్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ల మీద తప్పసరిగా పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలని, లేదంటే పరీక్షకు అనుమతించబోమని స్పష్టంచేశారు.
మొబైల్స్, పెన్ డ్రైవ్స్, బ్లూ టూత్ డివైజెస్, చేతి గడియారాలు, క్యాలికులేటర్స్, వాలెట్స్, పర్సులు వంటి వస్తువులను తీసుకురావొద్దని అభ్యర్థులకు సూచించారు. మహిళా అభ్యర్థులకు సంబంధించిన ఆభరణాలు, బ్యాగులు, పౌచెస్కు అనుమతి లేదన్నారు. బ్లాక్ లేదా బ్లూ పెన్ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.