హనుమకొండ: ఐనవోలు మండలం పంథిని వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఈ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20 ట్రాక్టర్లలో వరంగల్కు అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 30 బైకులు, మద్యం కూడా పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. తూర్పు జోన్ డీసీపీ వెంకట లక్ష్మి స్వయంగా దగ్గరుండి ఈ తనిఖీలను పర్యవేక్షించారు.