రాజన్న సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) కాన్వాయ్ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. (Police checked) ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని రుద్రంగి చెక్ పోస్టు వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు.
ఎన్నికల నిబంధనలను(Election Code) అనుసరించి పోలీసులకు మంత్రి కేటీఆర్ పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.