CM KCR | నర్సాపూర్, నవంబర్ 17: సీఎం కేసీఆర్ పాల్గొన్న నర్సాపూర్ సభలో తుపాకీ బుల్లెట్లతో దొరికిన నిందితుడు అస్లాంపై అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్టు నర్సాపూర్ ఎస్సై శివకుమార్ శుక్రవారం తెలిపారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీ బుల్లెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు.
నిందితుడి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ కాగా, ప్రస్తుతం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్లో బంధువుల వద్ద ఉంటూ చికెన్ షాప్లో పనిచేస్తున్నాడని తెలిపారు. అస్లాం 2016లో జోగిపేటలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఎన్సీసీ విభాగంలో ఖాసీపూర్లో శిక్షణ పొందాడని, అప్పుడు అక్కడి ఓ గదిలో ఉన్న రెండు తుపాకీ బుల్లెట్లను వెంట తెచ్చుకున్నట్టు తెలిపారు. వాటిని జేబులో పెట్టుకొని సభకు రాగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.