బంజారాహిల్స్, జూన్ 4: జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక లైంగికదాడి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో శనివారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో సాదుద్దీన్ మాలిక్ (18) అనే యువకుడితో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. పోలీసులు మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తున్నది. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలింపు చేపట్టారు. దీంతోపాటు బెంజ్ కారులో బాలికతో సన్నిహితంగా వ్యవహరించిన పాతబస్తీకి చెందిన ఒక ఎమ్మెల్యే కొడుకును ఏ-6 నిందితుడిగా చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.
మైనర్ బాలికతో సన్నిహితంగా వ్యవహరించిన ఈ వ్యవహారం పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నది. గత నెల 28న జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్లో విందులో పాల్గొన్న బాలికను చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నది. గత నెల 28న జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్లో విందులో పాల్గొన్న బాలికను ఇంటి వద్ద దింపుతామంటూ తొలుత బెంజ్ కారులో ఒక బేకరీ వద్దకు, ఆ తరువాత అక్కడి నుంచి ఇన్నోవా కారులో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడి చేశారని ఆమె తండ్రి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో లైంగికదాడి, పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఇన్నోవా కారులో ఉన్న ఐదుగురిని నిందితులుగా చేర్చారు. వారిలో పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్ అలియాస్ సాద్(18), ఉమేర్ఖాన్(18) మేజర్లు కాగా మరో ముగ్గురు మైనర్లు. శనివారం అరెస్టు చేసిన సాదుద్దీన్ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మిగిలిన ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపర్చి, వైద్యపరీక్షల అనంతరం జువైనల్ హోమ్కు తరలించారు. పరారీలో ఉన్న సంగారెడ్డికి చెందిన ఒక నాయకుడి కొడుకును కూడా శనివారం రాత్రి అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు ఉమేల్ఖాన్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటన తరువాత అతడు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడు పట్టుబడితే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది.
అమ్నీషియా పబ్ నుంచి బంజారాహిల్స్కు వెళ్తున్న సమయంలో బెంజ్ కారులోని వెనుక సీట్లో కూర్చొన్న ఒక యువకుడు బాలికతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మీడియా ఎదుట ప్రదర్శించారు. వీడియోల్లో పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపించడంతో పాటు మైనర్ బాధితురాలి ఫొటోలు, వీడియోలను ప్రత్యక్ష ప్రసారంలో ప్రదర్శించడం కలకలం సృష్టించింది. సామూహిక లైంగికదాడికి గురైన బాలికకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రెస్మీట్లో బాధితురాలి వీడియోలను ప్రదర్శించడంపై విమర్శలొస్తున్నాయి. బెంజ్ కారులో పబ్ నుంచి బేకరీకి వెళ్తున్న సమయంలోని వీడియోలను, ఆ తరువాత జరిగిన లైంగికదాడితో ముడిపెట్టడంతో గందరగోళం నెలకొన్నది. ఇన్నోవా కారులోని యువకులే లైంగికదాడి చేశారని బాధితురాలు వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొనగా.. ఎమ్మెల్యే రఘునందన్రావు మాత్రం బెంజ్ కారులోనే ఘటన జరిగిందని వాదించడం గమనార్హం. ఆయన ప్రదర్శించిన వీడియోలో ఉన్న యువకుడు ఎవరన్న విషయంపై కూడా స్పష్టత రాలేదు. పోలీసులు అరెస్టుచేసిన నిందితులు నోరువిప్పితే అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నది.
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక లైంగికదాడి ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్గా తీసుకొన్నది. నిందితులు ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబానికి మహిళా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, సంక్షేమం, భద్రత విషయంలో రాజీపడటం లేదని పేర్కొన్నారు. మహిళల హెల్ప్లైన్ 181 లేదా పోస్టల్, ట్విట్టర్, ఈ-మెయిల్ లేదా కమిషన్ కార్యాలయ ఫోన్ నెంబర్ 9490555533కు మహిళలు తమ సమస్యలను తెలియజేయవచ్చని శనివారం ఒక ప్రకటనలో ఆమె సూచించారు.
కేసులో కీలకంగా భావిస్తున్న ఇన్నోవా కారును మొయినాబాద్లో పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొన్నారు. వక్ఫ్బోర్డు చైర్మన్ కొడుకు వినియోగించిన ఈ కారులోనే.. లైంగికదాడికి జరగడంతో దీని ఆచూకీ కోసం మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని సీసీ ఫుటేజీలను మూడు రోజులుగా జల్లెడ పట్టారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంలో భాగంగా కారును దాచారా? పోలీసులకు దొరికిపోతామనే భయంతో ఇతర ప్రాంతాలకు తరలించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఉన్న ఒక మైనర్ నెల్లూరుకు వెళ్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొన్నారు. ఘటన జరిగిన మూడురోజుల తర్వాత బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా పబ్ వద్ద జరిగిన సంఘటనలపై ఆరా తీయడంతో నిందితులు అప్రమత్తమైనట్టు భావిస్తున్నారు. కేసు నమోదైన తర్వాత నిందితులంతా తమ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను మూసేయడం, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి పారిపోయేందుకు ప్రయత్నించడం చూస్తుంటే పక్కా ప్రణాళికతోనే తప్పించుకొనే ప్రయత్నం చేసినట్టు అర్థమవుతున్నది. సెల్ఫోన్లు వాడితే పట్టుబడతామనే ఉద్దేశంతో ఫోన్లను వేరే ప్రాంతానికి తరలించారనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది.
జూబ్లీహిల్స్లో బాలికపై లైంగికదాడి ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులు ఏ స్థాయివారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. పార్టీల పేరుతో మైనర్లను పబ్బుల్లోకి అనుమతించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రారావుతో కూడిన బృందం డీజీపీ మహేందర్రెడ్డికి వినతిపత్రం ఇచ్చింది.