తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 13: తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కేం ద్ర సాంస్కృతికశాఖ సౌజన్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేర్స్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శనివారం శ్రీమదాంధ్ర మహాభారత అవతరణ, నన్న య్య సహస్రాబ్ధి మహోత్సవాలు ఘ నంగా నిర్వహించారు. నన్నయ వాజ్మ య పూర్ణిమ సహస్రాబ్ధి మహోత్సవ విశేష సంచికను వక్తలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడు తూ.. నన్నయ్య విశిష్టతను నేటి తరానికి తెలిసేలా గొప్ప కార్యక్రమం చేపట్టారని నిర్వహకులను ప్రశంసించారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు మన వారసత్వ సం పద అని అన్నారు. సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. ధర్మం నిగుడీకృతమైన గ్రం థం మహాభారతం ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ.. నన్నయ్య తెలుగు జాతికి ఎంతో ఉపకారం చేశారని కొనియాడారు. నన్నయ్య రచించిన భార తం చదివితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. పద్యలోక కామధేనువు నన్న య్య అని పేర్కొన్నారు. భారతీయం సత్యవాణి ప్రసంగిస్తూ ప్రాచీన భాషల ఉన్నతిని కొనియాడారు.