హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రకృతి పరిరక్షణలో మేము సైతం అంటూ పలువురు సెలెబ్రిటీలు దేశ వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ముందుకు వస్తున్నారు.
అందులో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటుడు వెంకట్ శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.
గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం టీవీ ఆర్టిస్ట్స్ హరిక్రిష్ణ, తేజ చౌదరి, నిఖిల్ ముగ్గురికి వెంకట్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.