కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 4 : ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయాలని, బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. ట్రస్మా కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురసారాలు అందజేశారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు ఇస్తున్న బీమా సదుపాయం, ఆర్థిక సహాయాన్ని ప్రైవేట్ టీచర్ల కూ అందజేయాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. త్వరలోనే హైదరాబాద్లో ప్రైవేటు ఉపాధ్యాయులతో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి దేశంలోని వివిధ రాజకీయ పార్టీల ఎంపీలను ఆహ్వానిస్తామని తెలిపారు. తద్వారా ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.