జీవితంలో ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదిలాడు గూడెం మహిపాల్రెడ్డి. పటాన్చెరు నుంచి లడఖ్ దాకా సైకిల్యాత్ర విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు సముద్ర మట్టానికి 5,538 మీటర్ల ఎత్తుపైన గులాబీ జెండా ఉంచి, టీఆర్ఎస్పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్ తన తల్లి, చెల్లెతో కలిసి పటాన్చెరులో నివాసముంటున్నాడు. స్థానికంగా చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. చిన్ననాటి నుంచి సాహసయాత్రలు చేయాలని కల కనేవాడు. అయితే, దీనికి పేదరికం అడ్డుగా మారింది. అయినా, వెంకటేశ్ వెనకడుగు వేయలేదు. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అని నమ్మే వెంకటేశ్ సైకిల్పై లడఖ్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. వెంకటేశ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆయన కొడుకు గూడెం విక్రంరెడ్డి వెన్నంటి ప్రోత్సహించారు.
పటాన్చెరు పట్టణం నుంచి సైకిల్ యాత్ర మొదలెట్టిన వెంకటేశ్ 2,600 కిలోమీటర్ల దూరంలో గల జమ్మూ కశ్మీర్లోని లడఖ్కు చేరుకున్నాడు. అలాగే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ పాస్ లడఖ్- ఖార్దుంగ్ లా పాస్ వద్దకు సైకిల్పై చేరుకున్నాడు. సముద్రమట్టానకి 5,538 మీటర్ల ఎత్తుకు చేరుకుని అక్కడ టీఆర్ఎస్ జెండాను ఎగురవేశాడు. తనను ప్రోత్సహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చిత్రపటాన్ని అక్కడ ఉంచి కృతజ్ఞతలు తెలిపాడు. గతంలోనూ వెంకటేశ్ పటాన్చెరు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్యాత్రను విజయవంతంగా పూర్తిచేశాడు.