హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్తోపాటు ప్రయోగాత్మకంగా సిద్దిపేటలోనూ ఈ సారి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు అవసరమైన బయోమెట్రిక్ పరికరాలు, డిజిటల్ హైట్ మీటర్లు, సీసీటీవీ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరికరాలు సహా ఇతర అన్ని సాంకేతిక సామగ్రిని నిర్వహణ కేంద్రాలకు తరలించారు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన ప్రతి దశనూ సీసీ కెమెరాలతో నమోదు చేస్తారు. షెడ్యూల్ ప్రకారం జనవరి మొదటివారంలో ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ పూర్తవుతుందన్న భావనలో అధికారులు ఉన్నారు.
అభ్యర్థులకు ఇవి తప్పనిసరి